ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న కవిత
మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు.
మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి మహిళా నేతగా కవిత స్థానం సంపాదించుకున్నారు.కాగా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషం. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా విదేశాల నుండి సైతం మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు. 2010 సంవత్సరంలో తొలిసారిగా ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆమె ఎప్పటికప్పుడు సమాచారాన్ని నెటిజన్లతో పంచుకోవడమే కాకుండా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ మానవతా హృదయంతో తక్షణ సహాయం అందిస్తున్నారు కవిత. అటు సామాజిక సమస్యలపై ప్రజలను ఎప్పటికప్పడు జాగృత పరుస్తున్నారు.
We are a million! Thank you for all your unconditional support. pic.twitter.com/S72X2IwaBm
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 20, 2020