అంబులెన్స్లో వచ్చి ఓటేసిన ముఖేష్ గౌడ్
కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్.. పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వచ్చి ఓటేశారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ముఖేష్ గౌడ్.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఎన్నికలు కావడంతో ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులు ఆయణ్ని అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్పై పోలింగ్ కేంద్రానికి తరలించగా.. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అబిడ్స్ పోస్టాఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖేష్ గౌడ్ […]
కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్.. పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వచ్చి ఓటేశారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ముఖేష్ గౌడ్.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఎన్నికలు కావడంతో ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులు ఆయణ్ని అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్పై పోలింగ్ కేంద్రానికి తరలించగా.. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అబిడ్స్ పోస్టాఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖేష్ గౌడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు.