క్షీణిస్తున్న జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

కొంత కాలంగా కిడ్నీ సమస్యలో బాధ పడుతున్నమాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గతవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఎయిమ్స్ లో చేరిన జైట్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎయిమ్స్ కు చేరుకుని.. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా […]

క్షీణిస్తున్న జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు రాష్ట్రపతి
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 12:56 PM

కొంత కాలంగా కిడ్నీ సమస్యలో బాధ పడుతున్నమాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గతవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఎయిమ్స్ లో చేరిన జైట్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎయిమ్స్ కు చేరుకుని.. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించిన జైట్లీ.. కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.