బీహార్‌లో మొదలైన ఎన్నికల సందడి- ఎన్‌డీఏ వైపుకొచ్చిన మాంఝీ

బీహార్‌లో ఎన్నికల సందడి మొదలయ్యింది.. రాజకీయ నేతలు తమ భవిష్యత్తు భద్రంగా ఉండటం కోసం ముందు జాగ్రత్త పడుతున్నారు.. అక్కడ ఇప్పటికే కప్పదాట్లు మొదలయ్యాయి.. ఆర్‌జేడీ నుంచి జేడీయూకు వలసలు మొదలయ్యాయి.

బీహార్‌లో మొదలైన ఎన్నికల సందడి- ఎన్‌డీఏ వైపుకొచ్చిన మాంఝీ
Follow us

|

Updated on: Sep 02, 2020 | 4:11 PM

బీహార్‌లో ఎన్నికల సందడి మొదలయ్యింది.. రాజకీయ నేతలు తమ భవిష్యత్తు భద్రంగా ఉండటం కోసం ముందు జాగ్రత్త పడుతున్నారు.. అక్కడ ఇప్పటికే కప్పదాట్లు మొదలయ్యాయి.. ఆర్‌జేడీ నుంచి జేడీయూకు వలసలు మొదలయ్యాయి.. ఈసారి టికెట్‌ దొరకడం కష్టమేనని అనుకుంటున్న జేడీయూ నేతలు ఆర్‌జేడీ తీర్థం పుచ్చుకుంటున్నారు.. ఊహించినట్టుగానే హిందుస్తానీ అవామ్‌ మోర్చా- హెచ్‌ఏఎమ్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ ఎన్‌డీఏ కూటమిలో చేరేందుకు సంసిద్ధులయ్యారు.. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌తో సంప్రదింపులు కూడా జరిపారు.. హెచ్‌ఏఎమ్‌కు తొమ్మిది స్థానాలు ఇచ్చేందుకు జేడీయూ కూడా అంగీకరించింది.. రేపోమాపో ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన రాబోతున్నది. తాము జేడీయూ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తామే తప్ప ఆ పార్టీలో తమ పార్టీని విలీనం చేయబోమని హెచ్‌ఏఏమ్‌ అధికార ప్రతినిధి దానిశ్‌ రిజ్వాన్‌ కుండబద్దలు కొట్టారు.

దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలు అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం నితీశ్‌ తీసుకుంటున్న విధానాలు తమకు నచ్చాయని, అందుకే ఎన్‌డీఏ కూటమిలో చేరుతున్నామని దానిశ్‌ అంటున్నారు. నెల రోజుల కిందటనే ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమి నుంచి జితన్‌ రామ్‌ మాంఝీ బయటకు వచ్చారు. అప్పుడే ఆయన ఎన్‌డీఏ వైపుకు వెళతారని రూఢీ అయ్యింది.. మొదట్లో జితన్‌ రామ్ కూడా జేడీయూలోనే ఉండేవారు.. 2015లో అందులోంచి బయటకు వచ్చి సొంతంగా హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా పార్టీని పెట్టుకున్నారు.. రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌పార్టీ కూటమిలో చేరారు.. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏకు జై కొడుతున్నారు.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు అధికారపక్షమైన జేడీయూకు, విపక్షమైన ఆర్‌జేడీకు సవాల్‌గా మారాయి.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన సంగతి తెలిసిందే. నితీశ్‌ కుమారే తమ సీఎం అభ్యర్థి అని నడ్డా ఆల్‌రెడీ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జేడీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జేడీయూ మాజీ నేత శరద్‌ యాదవ్‌ను కూడా మళ్లీ పార్జీలో చేర్చుకునేందుకు జేడీయూ ఉత్సాహపడుతోంది..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..