బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ క్యూ.. రేటు ఎంతో తెలుసా…?
కరోనా విజృంభించిన వేళ తమిళనాటలో బిర్యానీ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. పలుజిల్లాల్లో భారీగా ఆఫర్లు ప్రకటించడంతో బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేశారు. తిరుచ్చి, మధురై , దిండిగల్తో పాటు చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 10 పైసలకే బిర్యానీ ప్రకటించడంతో జనం క్యూ కట్టారు...
Biryani Day : ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. గాలి నుంచి వ్యాప్తి చెందుకుతున్న కరోనాను గాలికి వదిలిపెట్టారు. కొవిడ్ 19 కట్టుబాట్లను తుంగలో తొక్కారు. ఆఫర్ కోసం పరుగులు పెట్టారు. సండే కాలో బిర్యానీ అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు రావడం ఆలస్యం.. అన్నింటినీ వదిలేశారు. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం లేకుండా గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. తమిళనాడులో చాలా జిల్లాల్లో బిర్యానీ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
బిర్యానీ డే పేరుతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించారు. వ్యాపారంలో పోటీ పెరిగిపోవడంతో.. ఒకరిని మించి మరొకరు ఆఫర్లను ప్రకటించారు. ఓ ప్రముఖ రెస్టారెంట్ మరింత ముందు ప్రచారం చేసింది. తమ రెస్టారెంట్లో బిర్యానీ కేవలం 10 పైసలు అంటూ ప్రచారం అదరగొట్టింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలోకి రావడంతో ఇంకేంముంది. ఈ ఉదయం నుంచి అక్కడికి చేరుకుని క్యూ కట్టారు.
కరోనా విజృంభించిన వేళ తమిళనాటలో బిర్యానీ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. పలుజిల్లాల్లో భారీగా ఆఫర్లు ప్రకటించడంతో బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేశారు. తిరుచ్చి, మధురై , దిండిగల్తో పాటు చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 10 పైసలకే బిర్యానీ ప్రకటించడంతో జనం క్యూ కట్టారు. కిలోమీటర్ల మేర బిర్యానీ కోసం లైన్లు కనబడ్డాయి. అయితే క్యూలైన్లలో జనం సామాజిక దూరం పాటించడం మరిచిపోయారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే బెంగళూరులో ఓ ప్రముఖ రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 5 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. ఈ క్యూ లైన్ కాస్తా గంటన్నరలో 1.5 కిలోమీటర్ వరకు చేరింది. బిర్యానీ తినేందుకు కుటుంబాలతో సహా అక్కడి చేరుకొన్నారు. కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు.
Karnataka: Owner of the eatery says, “We opened this stall around 22 years ago. No preservatives are put in our biryani. We serve more than a thousand kilograms of biryani in one day.” https://t.co/HXOO1Ibfyn pic.twitter.com/dejRDm5OUP
— ANI (@ANI) October 11, 2020