ఉపాసన ట్వీట్.. మెగా ఫ్యామిలీకి మోదీ సర్ప్రైజ్
‘‘డియర్ మోదీజీ.. మా సౌత్ సినిమా ఇండస్ట్రీని కూడా కాస్త చూడండి’’ అంటూ ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మోదీని బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. అయితే ఈ మీటింగ్లో దక్షిణాది నుంచి ఎక్కువ సెలబ్రిటీలు పాల్గొనలేదు. దీంతో ఉపాసన తన అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిని కొంతమంది నెటిజన్లు వ్యతిరేకించగా.. మరికొందరు ఆమెకు మద్దతును ప్రకటించారు. ఇక ఈ […]
‘‘డియర్ మోదీజీ.. మా సౌత్ సినిమా ఇండస్ట్రీని కూడా కాస్త చూడండి’’ అంటూ ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మోదీని బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. అయితే ఈ మీటింగ్లో దక్షిణాది నుంచి ఎక్కువ సెలబ్రిటీలు పాల్గొనలేదు. దీంతో ఉపాసన తన అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిని కొంతమంది నెటిజన్లు వ్యతిరేకించగా.. మరికొందరు ఆమెకు మద్దతును ప్రకటించారు. ఇక ఈ వివాదం కాస్త ఇప్పుడు సద్దుమణగగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లకు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ విషయాన్ని చెర్రీ ధ్రువీకరించాడు. అవును త్వరలోనే నేను, నాన్న ప్రధానిని కలవబోతున్నాం. ఈ సమావేశం కోసం మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇక ఉపాసన చేసిన ట్వీట్పై స్పందించిన చెర్రీ.. ఆమె అలా ట్వీట్ చేసిన విషయం ట్రెండింగ్ అయ్యే వరకు తనకు తెలీదని వివరించాడు. ఉపాసన ఇలా స్పందిస్తుందని తాను ఊహించలేదని తెలిపాడు. ఈ విషయంపై ఆమెను ప్రశ్నిస్తే.. ‘‘నీకు ముందు చెప్తే నువ్వు ట్వీట్ చేయనివ్వవని నాకు తెలుసు. అందుకే చెప్పలేదు’’ అని చెప్పిందంటూ ఓ నవ్వు నవ్వాడు. ఇక ఆ ట్వీట్లో ప్రధాని మోదీని ఉపాసన ఏ మాత్రం తప్పు పట్టలేదని చెప్పుకొచ్చాడు. ఆ మీటింగ్లో ఎక్కువ మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉండటం తమకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెర్రీ తెలిపాడు. అయితే నిర్వాహకుల లోపం వల్లనే ఇలా అయ్యిందని తాము భావించామని వెల్లడించాడు. ఇక మోదీని కలిసేందుకు తాము ఎదురుచూస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు.