వరద గుప్పిట్లో నేపాల్.. 27 మంది మృతి
నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో.. వరదనీటి ధాటికి 27 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన ఇళ్లు కూలిపోతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఖాట్మండు నగరంలోని పలు […]
నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో.. వరదనీటి ధాటికి 27 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన ఇళ్లు కూలిపోతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఖాట్మండు నగరంలోని పలు ప్రాంతాల్లో రబ్బరు బోట్లను రంగంలోకి దించారు. కోసి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో.. నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వచ్చే రెండు రోజులపాటు నేపాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ సర్కారు కోరింది.