గంటన్నరలోనే నిత్యావసరాల డెలివరీ..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆర్డర్ చేసిన గంటన్నరలోనే... నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేసేలా... క్విక్ సేవలను ప్రారంభించింది ‘ఈ కామర్స్’ దిగ్గజం ‘ ఫ్లిప్కార్ట్’.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆర్డర్ చేసిన గంటన్నరలోనే… నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేసేలా… క్విక్ సేవలను ప్రారంభించింది ‘ఈ కామర్స్’ దిగ్గజం ‘ ఫ్లిప్కార్ట్’. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన నిత్యావసర వస్తువులను అమెజాన్ ఇండియా, జియో మార్ట్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. వీటికి పోటీనిచ్చే మాదిరిగా క్విక్ పేరుతో ముందుకు వచ్చింది ఫ్లిప్కార్ట్ . బెంగళూరులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి కూడా.
కనీస డెలివరీ ఛార్జీని రూ. 29 గా నిర్ణయించారు. అర్ధరాత్రి దాకా సేవలను విస్తరించారు. మటన్, చికెన్ సహా మరో రెండు వేల రకాల ఉత్పత్తులను క్విక్ సేవల కింద సరఫరా అవుతాయి. బెంగళూరులో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను తాజాగా ప్రారంభించారు. వైట్ఫీల్డ్, పనతూరు, హెచ్ఎస్ఆర్ లే ఔట్, బీటీఎం లే ఔట్, బానాశంకరి, కేఆర్ పురమ్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆరు ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
Read More: