ఫ్లిప్‌కార్ట్ జాతర… మూడురోజులే! హరియప్

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో సేల్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేస్తోంది. దీని పేరు ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్. ఇందులో వివిధ రకాల ప్రొడక్టులపై సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్‌ మే 1 నుంచి 3 వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దారులు 10 శాతం తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి […]

ఫ్లిప్‌కార్ట్ జాతర... మూడురోజులే! హరియప్
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 5:02 PM

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో సేల్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేస్తోంది. దీని పేరు ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్. ఇందులో వివిధ రకాల ప్రొడక్టులపై సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్‌ మే 1 నుంచి 3 వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దారులు 10 శాతం తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఫ్యాషన్ ఉత్పత్తులపై ఏకంగా 40 నుంచి 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ వంటి పలు ప్రొడక్టుల ధర రూ.99 నుంచే ప్రారంభమౌతుందని తెలిపింది.

ఇక ఎలక్ట్రానిక్స్, ఇతర యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది.హెడ్‌ఫోన్స్, స్పీకర్ల వంటి వాటిపై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ల్యాప్‌టాప్స్‌ను రూ.13,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. పవర్ బ్యాంక్స్ ధర కూడా 500 నుంచి ప్రారంభమౌతుందని తెలిపింది.

టీవీలపై 75 శాతం వరకు తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐరన్ బాక్స్ ధర రూ.275 నుంచి, మిక్సర్ ధర రూ.999 నుంచి ప్రారంభమౌతోందని పేర్కొంది. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై 50 శాతం తగ్గింపు పొందొచ్చని తెలిపింది. అలాగే హోమ్ ఫర్నీచర్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉందని పేర్కొంది.