అంబులెన్స్ ఛార్జీలపై సుప్రీం ఆదేశాలు
కరోనా నేపథ్యంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది
Supreme Court Ambulance: కరోనా నేపథ్యంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయమైన ధరలకే అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్ ఛార్జీల పెంపుపై దాఖలైన పిల్పై జస్టిస్ అశోక్భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కాకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్రాలు న్యాయబద్ధమైన ధరలకు సేవలు అందించాలని సూచించింది. అలాగే అంబులెన్స్లు తగినన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రతి జిల్లాలో అంబులెన్స్లు అందుబాటులో ఉండాలని , వాటి సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ణయించాలని న్యాయస్థానం తెలిపింది. అంబులెన్స్ సేవల కోసం రూ.7వేలు వసూలు చేస్తున్నారని, కొన్నిసార్లు రూ.50వేల దాకా వస్ఊలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వివరించింది. ఇతరుల దయతో అంబులెన్స్లు పొందాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది.
Read More: