శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం..హెడ్ కానిస్టేబుల్ కుటుంబం దుర్మరణం
శ్రీశైలం రహదారి రక్తసిక్తమైంది. ఇన్నోవా వాహనం లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిన విధానం చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కుటుంబం ఈ ప్రమాదంలో మృత్యువాతపడింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా […]
శ్రీశైలం రహదారి రక్తసిక్తమైంది. ఇన్నోవా వాహనం లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిన విధానం చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కుటుంబం ఈ ప్రమాదంలో మృత్యువాతపడింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ప్రమాదవశాత్తూ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్తో పాటు ఆయన కుమారుడు శాంతన్, సోదరి పద్మజ, బావ రాజు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన దుర్గా ప్రసాద్ భార్య విజయ లక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.