పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి బొల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే మరణించగా..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి బొల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే మరణించగా.. మరోకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పాల్ఘర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంతో డివైడర్ను ఢీ కొట్టిందని.. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మరోకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. అంబులెన్స్లో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.