ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి

మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను మాయమాటలో చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఫలితం లేకుండా పోతోంది. కర్కోటకులకు భయం అనేది లేకుండపోతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి
Follow us

|

Updated on: Jul 05, 2020 | 8:20 PM

మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను మాయమాటలో చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఫలితం లేకుండా పోతోంది. కర్కోటకులకు భయం అనేది లేకుండపోతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెబుతూ లోబర్చుకున్నాడు. తరుచూ వారికి చాక్లెట్లు ఆశజూపి లొంగదీసుకున్నాడు. కొద్దిరోజులుగా చిన్నారులను నమ్మిస్తూ ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే, చిన్నారులకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ కామాంధుడిని బంధించిన గ్రామస్తులు దేహశుద్ది చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను చిదిమేసిన కీచకుడిని ఉరిశిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.