నీరు లేక చేపలు విలవిల…
కరోనా కష్టాలు ఓ వైపు వెంటాడుతుంటే… మరోవైపు నీటి కష్టాలు రాజస్థాన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా.. అక్కడ మాత్రం నీరు లేక చెరువులు ఎండిపోయాయి. అందులో ఉండే చేపలు విలవిలలాడుతున్నాయి. ఈ ఘటన జోద్పూర్ జిల్లా సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. చెరువుల్లో నీటి జాడ లేక పోవటంతో అందులో ఉండే చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితి గమనించిన గ్రామస్థులు తలో చేయి వేశారు. ఇంటికి రూ. 300 […]
కరోనా కష్టాలు ఓ వైపు వెంటాడుతుంటే… మరోవైపు నీటి కష్టాలు రాజస్థాన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా.. అక్కడ మాత్రం నీరు లేక చెరువులు ఎండిపోయాయి. అందులో ఉండే చేపలు విలవిలలాడుతున్నాయి. ఈ ఘటన జోద్పూర్ జిల్లా సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. చెరువుల్లో నీటి జాడ లేక పోవటంతో అందులో ఉండే చేపలు మృత్యువాత పడుతున్నాయి.
ఈ పరిస్థితి గమనించిన గ్రామస్థులు తలో చేయి వేశారు. ఇంటికి రూ. 300 చొప్పున జమ చేశారు. ఆ డబ్బుతో చెరువులోకి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించారు. ఆ నీటిని చెరువులోకి వదలడంతో.. కొన్నాళ్లు చేపలు బతికే అవకాశం ఉంది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో చేపల… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
Rajasthan: Several fish found dead in a pond in Soyla village, Jodhpur. Tehsildar says, “There’s no rainfall so water level went down&fish died. We arranged water tanker after contributing Rs 300 each. Water is being transferred into the pond so that fish that are alive can live” pic.twitter.com/3nWyORLeP2
— ANI (@ANI) June 13, 2020