తిరుమల శేషాచల అడవుల్లో మంటలు

తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని కుమారధార – పసుపుధార జంట డ్యామ్ ల సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటిదాకా సుమారు 10 ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. గత రెండు రోజులుగా సూర్యతాపం ఎక్కువగా ఉన్న కారణంగా చెట్ల నుంచి రాలిన ఆకులు ఎండవేడికి అంటుకుని ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరకుని అతికష్టం మీద మంటలను […]

తిరుమల శేషాచల అడవుల్లో మంటలు
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 11:05 AM

తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని కుమారధార – పసుపుధార జంట డ్యామ్ ల సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటిదాకా సుమారు 10 ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. గత రెండు రోజులుగా సూర్యతాపం ఎక్కువగా ఉన్న కారణంగా చెట్ల నుంచి రాలిన ఆకులు ఎండవేడికి అంటుకుని ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరకుని అతికష్టం మీద మంటలను ఆర్పివేశారు.