బ్రేకింగ్: ఏపీ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు
ఏపీ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖకు వెళ్తోన్న ఏపీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చెలరేగింది. సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు బయల్దేరిన గంటలోపే B1 కోచ్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు ఫైర్ అలారమ్ మోగించడంతో.. రైల్వే సిబ్బంది, రైలును ఆపేశారు. బోగీలోని ప్రయాణికులను కిందకు దించేసి.. B1 బోగీని రైలు నుంచి వేరు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి […]
ఏపీ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖకు వెళ్తోన్న ఏపీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చెలరేగింది. సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు బయల్దేరిన గంటలోపే B1 కోచ్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు ఫైర్ అలారమ్ మోగించడంతో.. రైల్వే సిబ్బంది, రైలును ఆపేశారు. బోగీలోని ప్రయాణికులను కిందకు దించేసి.. B1 బోగీని రైలు నుంచి వేరు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ మంటలకు గల కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లోపమో లేక ఏసీ కారణంగానో మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.