ఆక్వా గోడౌన్లో మంటలు.. ఇద్దరికి గాయాలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్వా గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్వా గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.