పసుపు కొమ్ముల గోడౌన్లో మంటలు
కడప మార్కెట్ యార్డులోని పసుపు కొమ్ముల గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాలిషింగ్ కోసం వచ్చిన పసుపు కొమ్ముల బస్తాలు చాలా వరకు మంటల్లో కాలిబూడిదై పోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటాలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో దాదాపు 60 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లుగా మిల్లు నిర్వాహకుడు రమేష్ […]
కడప మార్కెట్ యార్డులోని పసుపు కొమ్ముల గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాలిషింగ్ కోసం వచ్చిన పసుపు కొమ్ముల బస్తాలు చాలా వరకు మంటల్లో కాలిబూడిదై పోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటాలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో దాదాపు 60 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లుగా మిల్లు నిర్వాహకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.