పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఆరుగురికి తీవ్ర గాయాలు

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ కర్మాగారంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే […]

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఆరుగురికి తీవ్ర గాయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 4:48 AM

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ కర్మాగారంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.