బాసర ఆర్జీయూకేటీలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ, ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారుజామున అకడమిక్ బ్లాక్-1 తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఉదయం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న వారు ఈ మంటలను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏబీ-1 బ్లాక్‌లోని ఫర్నీచర్, ప్రాజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. క్యాంపస్ […]

బాసర ఆర్జీయూకేటీలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 7:48 AM

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ, ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారుజామున అకడమిక్ బ్లాక్-1 తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఉదయం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న వారు ఈ మంటలను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏబీ-1 బ్లాక్‌లోని ఫర్నీచర్, ప్రాజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. క్యాంపస్ పూర్తిగా పొగతో నిండిపోయింది. దాదాపు రూ.20 లక్షల నష్టం జరిగిందని ఆర్జీయూకేటీ అధికారులు చెబుతున్నారు.

కాగా ఈ ప్రమాదంపై విద్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో రెండుసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 2 నెలల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ఆలస్యంగా బయటకువచ్చాయి.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్