ఆర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు.. రీజన్ ఇదే..
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిపై ఛత్తీస్గడ్లో కేసు నమోదైంది. ఆర్నాబ్ గోస్వామి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఛత్తీస్ఘడ్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి.. టీఎస్ సింగ్ డియో, చత్తీస్గడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కమ్లు రాయపూర్లోని సివిల్ లైన్స్ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్ చేశారు. దీంతో ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. ఆర్నాబ్ గోస్వామిపై ఐపీసీ సెక్షన్ 153 ఏ,295ఏ,502(2) కింద కేసులు నమోదు చేశారు. ఆర్నాబ్ […]
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిపై ఛత్తీస్గడ్లో కేసు నమోదైంది. ఆర్నాబ్ గోస్వామి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఛత్తీస్ఘడ్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి.. టీఎస్ సింగ్ డియో, చత్తీస్గడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కమ్లు రాయపూర్లోని సివిల్ లైన్స్ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్ చేశారు. దీంతో ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. ఆర్నాబ్ గోస్వామిపై ఐపీసీ సెక్షన్ 153 ఏ,295ఏ,502(2) కింద కేసులు నమోదు చేశారు. ఆర్నాబ్ విద్వేషపూరిత పుకార్లను ప్రచారం చేశారని.. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా.. బుధవారం రాత్రి ఆర్నాబ్ గోస్వామి తన భార్యతో కార్లో వెళ్తుంటే.. ముంబై సమీపంలో దుండగులు దాడికి దిగారు. దీంతో ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. కాగా.. దాడికి పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనంటూ ఆర్నాబ్ ఆరోపించారు. ఈ దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియానే బాధ్యత వహించాలన్నారు.