ప్రభుత్వ రంగ బ్యాంకు చార్జీలు పెంచబోముః కేంద్రం
బ్యాంకుల ఖాతాదారులకు కేంద్ర మోదీ సర్కార్ తీపికబురునందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చార్జీలు పెంచబోవని స్పష్టం చేసింది.
బ్యాంకుల ఖాతాదారులకు కేంద్ర మోదీ సర్కార్ తీపికబురునందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చార్జీలు పెంచబోవని స్పష్టం చేసింది.ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ తాజా ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులు పీఎస్బీఎస్ సర్వీస్ చార్జీలను పెంచాయనే మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. కొవిడ్ 19 ప్రతికూల సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ చార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండబోదని తెలిపింది. జన్ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్, విత్డ్రాయెల్స్పై నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చార్జీలు నవంబర్ ఒకటి నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
As per RBI guidelines, all banks, including PSBs, are permitted to levy charges for their services in a fair, transparent & non-discriminatory manner, other PSBs have also intimated that they do not propose to raise bank charges in the near future in view of COVID pandemic.(5/5)
— Ministry of Finance (@FinMinIndia) November 3, 2020