కొత్త రెవెన్యూ చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: హరీశ్ రావు
త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అర్హులైన వారికి 1201 పట్టాదారు పాసు పుస్తకాలను, 101 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]
త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అర్హులైన వారికి 1201 పట్టాదారు పాసు పుస్తకాలను, 101 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తరువాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి సంతకం పెడితే ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాన్ని పంపించేలా చేయబోతున్నామని పేర్కొన్నారు. మీ టైటిల్ డీడ్, ఇతరత్రా సమస్యలు లేకుండా సులభతరమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మార్పులు తేనున్నామని ఆయన తెలిపారు. వచ్చే పంటకు ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.5వేల రూపాయలు రైతుబంధు పథకం కింద ఇవ్వనున్నామని వెల్లడించారు. దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.