బాలీవుడ్ ‘అమానుషాలపై’ రూపా గంగూలీ మండిపాటు
బాలీవుడ్ 'అమానుషాలపై' బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మండిపడ్డారు. అమాయకులను ఈ ఇండస్ట్రీ ఒకవిధంగా 'చంపేస్తోందని', డ్రగ్స్ కి వారిని బానిసలుగా మారుస్తోందని ఆమె దుయ్యబట్టారు. మహిళలను బాలీవుడ్ అవమానిస్తోంది..
బాలీవుడ్ ‘అమానుషాలపై’ బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మండిపడ్డారు. అమాయకులను ఈ ఇండస్ట్రీ ఒకవిధంగా ‘చంపేస్తోందని’, డ్రగ్స్ కి వారిని బానిసలుగా మారుస్తోందని ఆమె దుయ్యబట్టారు. మహిళలను బాలీవుడ్ అవమానిస్తోంది, అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు, ముంబై పోలీసులు కూడా మౌనంగా ఉంటున్నారు అని ఆమె ఆరోపించారు. అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల విషయంలో బాలీవుడ్ ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తోందని రూపా గంగూలీ ప్రశ్నించారు. కశ్యప్ పై పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడంలేదన్నారు . (తనను అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది). అయితే ఇవి తప్పుడు ఆరోపణలని కశ్యప్ లాయర్ కొట్టి పారేశారు. తన క్లయింటు ప్రతిష్టను మంట గలపడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవని ఆయన ఖండించారు.