ఉల్లికోసం తోపులాట… పలువురికి గాయాలు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉల్లి కష్టాలు తీరటం లేదు. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ప్రజలు గంటలతరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉదయం తెల్లవారక ముందే నుండే బారులు తీరిన జనాలు ఉల్లి కోసం సిగపట్లకు దిగిన సంఘటనలు సైతం నెలకొన్నాయి. ఇవాళ కూడా విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో రైతు బజార్ వద్ద ఉల్లిపాయల కోసం తోపులాట జరిగింది. గేట్లు తీయగానే […]
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉల్లి కష్టాలు తీరటం లేదు. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ప్రజలు గంటలతరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉదయం తెల్లవారక ముందే నుండే బారులు తీరిన జనాలు ఉల్లి కోసం సిగపట్లకు దిగిన సంఘటనలు సైతం నెలకొన్నాయి. ఇవాళ కూడా విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో రైతు బజార్ వద్ద ఉల్లిపాయల కోసం తోపులాట జరిగింది. గేట్లు తీయగానే ఒక్కసారిగా ప్రజలు రైతు బజార్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే చాలా మంది కిందపడిపోయారు. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.