దారుణం.. టీ పెట్టలేదంటూ భర్తని కట్టేసి కొట్టిన భార్య..!
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రైం రేటు తగ్గిందని అంతా అనుకున్నారు. కానీ పలుచోట్ల జరగాల్సిన దారుణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో తేనీరు రెడీ చేసే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త టీ పెట్టమంటూ భార్యను అడిగాడు. అయితే ఆమె టీ పెట్టేందుకు […]
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రైం రేటు తగ్గిందని అంతా అనుకున్నారు. కానీ పలుచోట్ల జరగాల్సిన దారుణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో తేనీరు రెడీ చేసే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త టీ పెట్టమంటూ భార్యను అడిగాడు. అయితే ఆమె టీ పెట్టేందుకు నో చెప్తూ.. నువ్వే పెట్టుకో అంటూ భర్తకు చెప్పింది. ఈ విషయంలో తెలత్తిన చిన్నవిషయం.. పెద్ద గోడవకు దారితీసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. తన సోదరుడితో పాటు.. మరో ఇద్దర్ని పిలిచింది. వారు వచ్చాక.. తన భర్తను కట్టేసి.. తీవ్రంగా కోట్టింది. దీంతో ఈ ఘటనను గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని వారి బారి నుంచి రక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.