విజయవాడలో విద్యార్థుల మధ్య గొడవ.. రాళ్లు, కత్తులతో..!
విజయవాడలో విద్యార్థులు రెచ్చిపోయారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు.
విజయవాడలో విద్యార్థులు రెచ్చిపోయారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇందులో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పటమటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్ జోక్యం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పలువురు రాజకీయ పార్టీ నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read This Story Also: ఆ ఇద్దరు వద్దేంటేనే విజయ్ వద్దకు వెళ్లిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!