జ్యోతి సాహసానికి గుర్తింపు..
దైర్యం... సాహసం.. పట్టుదల.. విపత్కర పరిస్థితుల మధ్య జ్యోతి చూపిన పట్టుదలకు, తెగువకు, ఆమె శక్తి సామర్థ్యాలకు అశ్చర్యపోయింది భారత సైక్లింగ్ సమాఖ్య. జ్యోతితో మాట్లాడి ట్రయల్స్కు ఢిల్లీ రావాలని కోరింది.
దైర్యం… సాహసం.. పట్టుదల.. విపత్కర పరిస్థితుల మధ్య జ్యోతి చూపిన పట్టుదలకు, తెగువకు, ఆమె శక్తి సామర్థ్యాలకు అశ్చర్యపోయింది భారత సైక్లింగ్ సమాఖ్య. జ్యోతితో మాట్లాడి ట్రయల్స్కు ఢిల్లీ రావాలని కోరింది.
వలస కూలీ కూతురు జ్యోతికి బంపర్ ఆఫర్ లభించింది. లాక్డౌన్ వేళ 1200 కిమీటర్ల పాటు సైకిల్ తొక్కి ఈ బాలిక చేసిన సాహసానికి గుర్తింపు లభించింది. ఈ బాలికను జాతీయ అకాడమీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జాతీయ సైక్లింగ్ సమాఖ్య తెలిపింది. త్వరలోనే ఢిల్లీలో ఆమెకు ఎంపిక పరీక్ష నిర్వహించనున్నామని సమాఖ్య చీఫ్ ఒంకార్ సింగ్ తెలిపారు. ఆమెను బిహార్ నుంచి ఢిల్లీకి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ కారణంగా ఏ ఆదాయం లేకపోవడంతో వారి జీవితం దుర్భరమైంది. దీంతో వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. ఇబ్బందులు ఎదురైనా నాన్నని వెనకాల కూర్చోబెట్టుకుని ఏకబిగిన ఏడు రోజుల పాటు సైకిల్ తొక్కింది. బిహార్లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఉపాధి నిమిత్తం ఆమె కుటుంబం గుర్గ్రామ్ చేరింది. తండ్రి మోహన్ పాసవాన్ ఆటోరిక్షా నడిపేవాడు. అయితే కరోనా లాక్డౌన్తో పనిలేకపోవడంతో ఆటోరిక్షా యజమాని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతకుముందే ప్రమాదంలో పాసవాన్ గాయపడడంతో లాక్డౌన్లో మరేదన్నా పని కూడా చేయలేకపోయాడు. దాంతో ఇంటి అద్దె కట్టలేని దుస్థితి. దీంతో ఇంటి యజమాని ఖాళీ చేయాలని హుకుం జారీ చేయకముందే సొంత ఊరికి వెళ్లిపోవాలనుకుంది జ్యోతి.
500 రూపాయలు పెట్టి ఓ పాత సైకిల్ కొని తండ్రిని వెనక కూర్చోబెట్టుకొని ఈనెల 10న జ్యోతి తన ప్రయాణం మొదలు పెట్టింది. రోజుకు 100 నుంచి 150కిలోమీటర్ల చొప్పున రాత్రనక పగలనక సైకిల్ తొక్కింది. ఎట్టకేలకు 1200 కిలోమీటర్ల దూరంలోని స్వస్థలానికి ఈనెల 18న చేరింది. ఆమె చేసిన సాహసం సోషల్మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇప్పుడు సమాఖ్య నిర్వహించే పరీక్షలో కూడా విజయం సాధించాలని సోషల్ మీడియా బ్లెస్సింగ్స్ చెబుతోంది.