ఖడ్గమృగాన్ని కాపాడిన జంతు సంరక్షణ అధికారులు
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణుల పట్ల ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే వందకు పైగా వన్య ప్రాణులు వరదల ధాటికి ప్రాణాలు విడిచాయి. ఇక కజిరంగా నేషనల్ పార్క్లో ఉన్న జంతువులు..
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణుల పట్ల ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే వందకు పైగా వన్య ప్రాణులు వరదల ధాటికి ప్రాణాలు విడిచాయి. ఇక కజిరంగా నేషనల్ పార్క్లో ఉన్న జంతువులు అందులో నుంచి బయటకు కూడా పారిపోయాయి. అంతేకాదు.. అటు అటవీ శాఖ అధికారులు, పార్క్కు చెందిన అధికారులు అందులో ఉన్న జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దగాన్ అనే ఓ గ్రామంలో ఓ ఖడ్గమృగం ప్రత్యక్షమైంది. తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో అది కదలకుండా ఉండిపోయింది. విషయాన్ని కజిరంగా నేషనల్ పార్క్ అధికారులకు తెలియ జేయడంతో.. ఆ గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, వన్య ప్రాణి సంరక్షణ సభ్యులు ఆ ఖడ్గమృగాన్ని రక్షించారు.
Assam: A joint team of Kaziranga National Park & Centre for Wildlife Rehabilitation And Conservation (CWRC) rescued a female rhino calf from Dahgaon village today. The calf is under observation at CWRC – wildlife care facility of Assam Forest Dept & Wildlife Trust of India (WTI). pic.twitter.com/4sYfmliJ76
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా