పండంటి ఆడపిల్లలకు విషం తాగించిన తండ్రి
ఆడపిల్లలకు అమ్మ కడుపులోనే రక్షణ లేకుండా పోతుంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు..కడుపులోనే చిధిమేస్తున్నారు కొందరు దుర్మార్గులు.
ఆడపిల్లలకు అమ్మ కడుపులోనే రక్షణ లేకుండా పోతుంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు..కడుపులోనే చిధిమేస్తున్నారు కొందరు దుర్మార్గులు. అవాంతరాలన్ని దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చినా కూడా తల్లుల ప్రాణాలకు సేఫ్టి ఉండటం లేదు. తాజాగా ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో, జీర్ణించుకోలేక ఆ శిశువులకు విషమిచ్చాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలంలో చోటుచేసుకుంది
మండలంలోని దేశాయిపల్లికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులకు ఈ నెల 1న రాత్రి పండంటి కవల ఆడపిల్లలు జన్మించారు. అప్పటికే వారికి ఒక కుమార్తె ఉంది. రెండో కాన్పులోనూ ఆడశిశువులే పుట్టడంతో కేశవులు భారంగా భావించాడు. విసుగుతో ఆ చిన్నారులను చంపేందుకు యత్నించాడు.ఈ క్రమంలో భార్యకు తెలియకుండా కవల శిశువులకు పురుగుల మందు పట్టించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఏం తెలియనట్టు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శిశువులను పరిశీలించిన డాక్టర్లు వారిద్దరికి పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే కేశవులు పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు శిశువలకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం