పండంటి ఆడ‌పిల్ల‌ల‌కు విషం తాగించిన తండ్రి

ఆడ‌పిల్ల‌ల‌కు అమ్మ క‌డుపులోనే ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు..క‌డుపులోనే చిధిమేస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు.

పండంటి ఆడ‌పిల్ల‌ల‌కు విషం తాగించిన తండ్రి
Follow us

|

Updated on: Sep 04, 2020 | 11:45 AM

ఆడ‌పిల్ల‌ల‌కు అమ్మ క‌డుపులోనే ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు..క‌డుపులోనే చిధిమేస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు. అవాంత‌రాల‌న్ని దాటి బాహ్య ప్ర‌పంచంలోకి వ‌చ్చినా కూడా త‌ల్లుల ప్రాణాల‌కు సేఫ్టి ఉండ‌టం లేదు. తాజాగా ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు పుట్ట‌డంతో, జీర్ణించుకోలేక‌‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో క‌సాయి తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లంలో చోటుచేసుకుంది

మండ‌లంలోని దేశాయిప‌ల్లికి చెందిన కేశ‌వులు, కృష్ణ‌వేణి దంప‌తుల‌కు ఈ నెల 1న రాత్రి పండంటి క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్ప‌టికే వారికి ఒక కుమార్తె ఉంది. రెండో కాన్పులోనూ ఆడ‌శిశువులే పుట్టడంతో కేశ‌వులు భారంగా భావించాడు. విసుగుతో ఆ చిన్నారుల‌ను చంపేందుకు య‌త్నించాడు.ఈ క్ర‌మంలో భార్య‌కు తెలియ‌కుండా క‌వ‌ల శిశువుల‌కు పురుగుల మందు ప‌ట్టించాడు. పిల్ల‌లు అప‌స్మార‌క స్థితిలోకి చేరుకోవ‌డంతో ఏం తెలియ‌న‌ట్టు వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. శిశువుల‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు వారిద్ద‌రికి పాయిజ‌న్ అయిన‌ట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆస్ప‌త్రికి‌ త‌ర‌లించారు. అయితే కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం ఇద్ద‌రు శిశువ‌ల‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు‌. చిన్నారుల‌ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..