అమిత్ షా చర్చల ప్రతిపాదనకు తలొగ్గని రైతులు, ముందు షరతులు వద్దని డిమాండ్ ! ఢిల్లీలో అదే సీన్ !

డిసెంబరు 3 న చర్చలకు రావాలని, మీ నిరసన కార్యక్రమాన్ని కేంద్రం నిర్ణయించిన స్థలం వద్దే చేపట్టాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనను రైతులు తిరస్కరించారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేస్తున్న వీరు..

అమిత్ షా చర్చల ప్రతిపాదనకు తలొగ్గని రైతులు, ముందు షరతులు వద్దని డిమాండ్ ! ఢిల్లీలో అదే సీన్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2020 | 5:33 PM

డిసెంబరు 3 న చర్చలకు రావాలని, మీ నిరసన కార్యక్రమాన్ని కేంద్రం నిర్ణయించిన స్థలం వద్దే చేపట్టాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనను రైతులు తిరస్కరించారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేస్తున్న వీరు..ఎలాంటి ముందు షరతులనూ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. కేంద్రం అరమరికలు లేకుండా మనస్ఫూరిగా చర్చలకు రావాలని కోరారు. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన  ఓ కమిటీ.. ప్రస్తుతానికి బోర్డర్లో ధర్నా చేయాలని నిర్ణయించింది. తాము విశాలమైన రామ్ లీలా గ్రౌండ్స్ లోనే ధర్నా చేస్తామని అన్నదాతలు పట్టుబడుతున్నారు.

ఇలా ఉండగా ఢిల్లీ-హర్యానా బోర్డర్లో ఆదివారం ఉదయం కూడా రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నెరాలా ప్రాంతం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు కదిలారు. వారిని అడ్డుకునేందుకు ఖాకీలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ రైతులతో చర్చలకు సమాయత్తమవుతున్నారు.  డిసెంబరు 3 న తమతో చర్చలకు రావాలని వివిధ రైతు సంఘాలను ఆయన ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా రైతు చట్టాలను ఉపసంహరించనిదే తాము వెనక్కి వెళ్ళేది లేదని అన్నదాతలు భీష్మించుకుని కూర్చున్నారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?