వరుణుడి కోసం అన్నదాత ఎదురుచూపులు..!
మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న, తెలంగాణను 13న రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. దీంతో వరుణుడి రాక కోసం అటు రైతులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న, తెలంగాణను 13న రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. దీంతో వరుణుడి రాక కోసం అటు రైతులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.