కేబుల్ బ్రిడ్జిపై ఈ ఫ్యామిలీ సర్కస్.!..‘నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’..

కేబుల్ బ్రిడ్జి పై నుంచి వెళ్లేవారికి పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు. వాహనదారులు తప్పని సరిగా ఆ నిబందనలు పాటించాలని, లేదంటే భారీ జరిమానా తప్పదని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జిపై ఈ ఫ్యామిలీ సర్కస్.!..‘నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’..
Follow us

|

Updated on: Oct 22, 2020 | 5:17 PM

కేబుల్ బ్రిడ్జి పై నుంచి వెళ్లేవారికి పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు. వాహనదారులు తప్పని సరిగా ఆ నిబందనలు పాటించాలని, లేదంటే భారీ జరిమానా తప్పదని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అతిక్రమించిన వారికి ఇప్పటికే భారీ జరిమానాలు సైతం పోలీసులు విధించారు. అయినా, కొంత మంది తమ తీరు మార్చుకోవడం లేదు. రోడ్డుపై వాహనాలు ఆపి, నడిరోడ్డుపైనే ఫోటోలు దిగుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలతో ప్రమాదమని పోలీసులు చెబుతున్నా కొంత మంది యువత వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ కుటుంబం కేబుల్ బ్రిడ్జి మీద ఫోటోలు దిగడానికి బండి ఆపింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

కేబుల్ బ్రిడ్జిపై భార్యా పిల్లలతో ఎంచక్కా ఫోటోలు దిగుదామనుకున్న వ్యక్తి బండిని ఆపాడు. ఆ తర్వాత బండి నంబర్‌కు చలాన్ పడకూడదని అక్కడికి వచ్చిన వ్యక్తి అతి తెలివి ప్రదర్శించి తన భార్య చున్నీతో నెంబర్ ప్లేట్‌ను కప్పేశాడు. భార్యా పిల్లలతో ఫోటో దిగే ప్రయత్నం చేశాడు. ఇంతలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు. ఆ మైక్ వారిని పరిశీలిస్తున్న కెమెరా దగ్గరే ఉంది. ఈ విషయం గమనించిన వారు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కుటుంబానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ఎల్లప్పుడూ పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.