పాక్కు మరో ఝలక్.. కశ్మీర్ అంశంతో మాకు సంబంధం లేదు.. అది భారత్దే..
కశ్మీర్ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య కాకుండా.. తాజాగా తాలిబన్లు కూడా కశ్మీర్ అంశంపై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తాలిబన్ తేల్చేసింది. అంతేకాదు.. కశ్మీర్ ఎప్పటికీ భారత్దేనని తాలిబన్ పేర్కొంది. తాము ఇతర దేశలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అవ్వమని.. కశ్మీర్లో జిహాద్ పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుందని.. అయితే ఈ విషయంలో పాకిస్థాన్కు మద్దతు తెల్పినట్లు ఓ ట్వీట్ […]
కశ్మీర్ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య కాకుండా.. తాజాగా తాలిబన్లు కూడా కశ్మీర్ అంశంపై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తాలిబన్ తేల్చేసింది. అంతేకాదు.. కశ్మీర్ ఎప్పటికీ భారత్దేనని తాలిబన్ పేర్కొంది. తాము ఇతర దేశలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అవ్వమని.. కశ్మీర్లో జిహాద్ పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుందని.. అయితే ఈ విషయంలో పాకిస్థాన్కు మద్దతు తెల్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అయ్యిందని.. సదరు ట్వీట్తో తమకు సంబంధం లేదని తేల్చేసింది. దీనికి సంబంధించి తాలిబన్ పొలిటికల్ వింగ్కు చెందిన ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తాలిబన్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అయ్యిందని.. అందులో.. “కశ్మీర్ సమస్యకు చెక్ పడేంత వరకు.. భారత్తో ఎలాంటి సత్సంబంధాలు ఉండవని తాలిబన్ ప్రకటించినట్లు ఉంది.” అయితే అది ఫేక్ న్యూస్ అని.. కశ్మీర్ అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదని తాలిబన్ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ వైరల్ ట్వీట్ను ముందుగానే గుర్తించిన భారత్.. తాలిబన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా.. తాలిబన్లే ఈ ట్వీట్ గురించి రెస్పాండ్ అయ్యారు.