తిరుపతిలో దొంగనోట్ల చలామణి..!
తిరుపతిలో దొంగనోట్ల ముఠా చెలరేగుతోంది. జోరుగా దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. యాదగిరి, బంగారుపాలెం, రామకుప్పం, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో దొంగనోట్లు చేతులు మారుతోన్నాయి. ముఖ్యంగా.. 500, 2000 రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుప్పం కేంద్రంగా దొంగనోట్ల చలామణి సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల ముఠాలో తిరుపతికి చెందిన ముగ్గురు, బెంగళూరుకు చెందిన ఇద్దరితో పాటు కుప్పంకు చెందిన ఒక వ్యక్తి కీలకంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. […]
తిరుపతిలో దొంగనోట్ల ముఠా చెలరేగుతోంది. జోరుగా దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. యాదగిరి, బంగారుపాలెం, రామకుప్పం, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో దొంగనోట్లు చేతులు మారుతోన్నాయి. ముఖ్యంగా.. 500, 2000 రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుప్పం కేంద్రంగా దొంగనోట్ల చలామణి సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల ముఠాలో తిరుపతికి చెందిన ముగ్గురు, బెంగళూరుకు చెందిన ఇద్దరితో పాటు కుప్పంకు చెందిన ఒక వ్యక్తి కీలకంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లపై స్థానికంగా ఉన్న ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు పోలీసులు యంత్రాంగం.