కాంగ్రెస్ ‘టార్చర్’ వలనే నాకు ఆరోగ్య సమస్యలు: ఎంపీ సాధ్వీ
కాంగ్రెస్ టార్చర్ వలనే తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో కంటి చూపు పోయిందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ టార్చర్ వలనే తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో కంటి చూపు పోయిందని ఆమె అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొన్న ఆమె అనంతరం మాట్లాడుతూ.. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
”కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో గాయాలయ్యాయి. ఆ గాయాలు అప్పడప్పుడు తిరగబడుతుంటాయి. కంటి రెటీనా నుంచి మెదడు వరకు వాపు, చీము రావడంతో చూపు పోయింది. ఇప్పుడు నా కుడి కన్ను అస్పష్టంగా కనిపిస్తుంది. ఎడమ కన్నుతో ఏమీ చూడలేను” అని ప్రగ్యా కామెంట్లు చేశారు.
మరోవైపు సాధ్వీ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీసీ శర్మ ఖండించారు. మహిళల పట్ల కాంగ్రెస్ గౌరవంగా ఉంటుందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లో 15 ఏళ్లు బీజేపీని అధికారంలో ఉంటే.. కాంగ్రెస్ ఆమెను ఎలా హింసిస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ప్రగ్యా ఆరోపణలు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని శర్మ అన్నారు.
Read This Story Also: నయన్-విఘ్నేష్కి కరోనా.. క్లారిటీ ఇచ్చిన టీమ్