రాజకీయ విమర్శలపై స్పందించిన ఫేస్బుక్
భారతదేశ రాజకీయాలు ఇప్పడు సామాజిక మాధ్యమాలపైకి మారాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై..
Facebook Responding to Criticism : భారతదేశ రాజకీయాలు ఇప్పడు సామాజిక మాధ్యమాలపైకి మారాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఫేస్బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఏ రాజకీయతోకాని ఆ పార్టీ పార్టీ అనుబంధ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్ను తాము నిషేధించామనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి అశాలపై ఇంకా చాలా చేయాల్సి ఉందనీ.. తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామని స్పష్టం చేశారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
We prohibit hate speech&content that incites violence&we enforce these policies globally without regard to anyone’s political position/party affiliation. We’re making progress on enforcement&conduct regular audits of our process to ensure fairness&accuracy: Facebook spokesperson pic.twitter.com/8zHJhZuXXJ
— ANI (@ANI) August 17, 2020
కాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇండియాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫేస్బుక్, వాట్సాప్లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ పౌరుల హక్కులను పరిరక్షించడం, సామాజిక.. ఆన్లైన్ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై సాక్ష్యాలను పరిశీలిస్తామన్నారు.
సొంతపార్టీ పైనే నియంత్రణ లేనివారు… మొత్తం ప్రపంచాన్నే బీజేపీ ఆర్ఎస్ఎస్లు కంట్రోల్ చేస్తున్నాయనే నిందలు వేయడం సహజమే అని కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. రాహుల్ గాంధీ ఆరోపణలకుకేంబ్రిడ్జ్ అనలిటికా మరియు ఫేస్బుక్లతో గోప్యంగా ఉంచాల్సిన డేటాను ఇస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికింది కాంగ్రెస్ అని ఆ విషయం గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. చేయాల్సిందంతా కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బీజేపీకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
Losers who cannot influence people even in their own party keep cribbing that the entire world is controlled by BJP & RSS.
You were caught red-handed in alliance with Cambridge Analytica & Facebook to weaponise data before the elections & now have the gall to question us? https://t.co/NloUF2WZVY
— Ravi Shankar Prasad (@rsprasad) August 16, 2020
దీనిపై గతంలో ఫేస్బుక్ కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ ఆ రోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయినవారు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్బుక్ ఒప్పందంతో రెడ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఎదురు దాడి చేసిన సంగతి తెలిసిందే.