కరోనా వైరస్ ముప్పు.. భారత్కు 17వ స్థానం..!
కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్ భారత్కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్ విశ్వవిద్యాలయం, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా […]
కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్ భారత్కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్ విశ్వవిద్యాలయం, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా నుంచి సగటున ఎంతమంది ఏయే దేశాలకు వెళ్తుంటారనే గణాంకాలను సేకరించారు. ”చైనాలోని హాంగ్ఝౌ విమానాశ్రయం నుంచి రాకపోకలను ఉదాహరణగా తీసుకుందాం.
వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. అక్కడి నుంచి వెయ్యి మంది ప్రయాణికులు బయలుదేరితే.. అందులో సగటున ఇద్దరు జర్మనీకి వెళ్లే అవకాశముంది. అంటే కరోనా వైరస్ జర్మనీకి వ్యాప్తి చెందే ముప్పు 0.2%గా ఉన్నట్లు నిర్ధారించాం” అని పరిశోధకులు వివరించారు. ఈ లెక్కన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 0.066%, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి 0.034%, కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి 0.024% ముప్పు ఉందని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 17వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా ఈ జాబితాలో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.