మాజీ ఎంపీ వినోద్ కుమార్కు కీలక పదవి..ఉత్తర్వులు జారీ!
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్ను నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కనుంది. మూడేళ్ల పాటు ఈ పదవిలో వినోద్ కొనసాగుతారు. రాజకీయాల్లో అనుభవం మరియు తెలంగాణా రాష్ట్రంపై మంచి పట్టు ఉండడంతో సీఎం కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Happy […]
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్ను నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కనుంది. మూడేళ్ల పాటు ఈ పదవిలో వినోద్ కొనసాగుతారు. రాజకీయాల్లో అనుభవం మరియు తెలంగాణా రాష్ట్రంపై మంచి పట్టు ఉండడంతో సీఎం కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Happy to receive Order appointing as Telangana state Planning Board Vice Chairman. Thanks to Honourable Chief Minister@TelanganaCMO @trspartyonline pic.twitter.com/D5aPzCvrgo
— B Vinod Kumar (@vinodboianpalli) August 16, 2019