టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?
అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి ఐటీ మంత్రి లోకేశ్ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసుల్ని దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ […]
అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి ఐటీ మంత్రి లోకేశ్ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసుల్ని దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి రైతుల సమస్యల గురించి తెలుసుకున్నారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా.. ఆ ఆలోచన ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మీనారాయణ, సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెదేపాలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.