బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా.. 28 మందికి కరోనా పాజిటివ్..!
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 28 కేసులు నమోదయ్యాయి. అందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 28 కేసులు నమోదయ్యాయి. అందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 732కు చేరింది. ”బీజేపీ మాజీ ఎమ్మెల్యే వయస్సు 62 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఆయన 150 మందికి పైగా వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యారు. వారి వివరాలను తెలుసుకుంటున్నాము అని ఓ అధికారి తెలిపారు. ఇక ఈ రోజు కరోనా పాజిటివ్ తేలిన వారందరికీ సిటీలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం అని వారు వివరించారు. కాగా మధ్యప్రదేశ్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 29కు చేరింది.
Read This Story Also: లాక్డౌన్ ముగియగానే శ్రుతీ చేసే పని అదేనట..!