ఇంటివద్దనే సీబీఎస్ఈ 10, 12 తరగతుల వాల్యువేషన్..
లాక్డౌన్కు ముందు నిర్వహించిన సీబీఎస్ఈ ఎగ్జామ్ పేపర్స్ మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఎగ్జామ్ పేపర్స్ వాల్యువేషన్ టీచర్స్ ఇంటివద్దనే చేస్తారని స్పష్టం చేశారు. ” 10, 12వ తరగతులకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ఎగ్జామ్ పేపర్స్ 3 వేల స్కూల్స్ నుంచి టీచర్స్ కు చేరుతాయి. ఆదివారం నుంచి వాల్యువేషన్ ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు తమ ఇంటివద్ద నుంచే ఎగ్జామ్ పేపర్స్ మూల్యాంకనం చేస్తారు. ఈ […]
లాక్డౌన్కు ముందు నిర్వహించిన సీబీఎస్ఈ ఎగ్జామ్ పేపర్స్ మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఎగ్జామ్ పేపర్స్ వాల్యువేషన్ టీచర్స్ ఇంటివద్దనే చేస్తారని స్పష్టం చేశారు.
” 10, 12వ తరగతులకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ఎగ్జామ్ పేపర్స్ 3 వేల స్కూల్స్ నుంచి టీచర్స్ కు చేరుతాయి. ఆదివారం నుంచి వాల్యువేషన్ ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు తమ ఇంటివద్ద నుంచే ఎగ్జామ్ పేపర్స్ మూల్యాంకనం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్య సరికి 50 రోజులు పడుతుంది” అని రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
కరోనా వైరస్ను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఆలస్యం జరిగింది. సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించి లాక్డౌన్కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన ఎగ్జామ్స్ జరిగాల్సి ఉండగా వాటిని లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు. వీటిని జులై 1 నుంచి 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవలే తెలిపారు.