లాక్డౌన్ ఎఫెక్ట్: పవన్ మూవీ వచ్చేది అప్పుడేనా..!
దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్..
దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్.. వాటిలో ఓ మూవీతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. అన్నీ కుదిరి ఉంటే ఈ నెలలోనే పవన్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ అనుకోకుండా కరోనా రావడం, లాక్డౌన్ ప్రకటించడంతో.. మూవీ షూటింగ్కు బ్రేక్ పడింది. ఇక జూన్ నుంచి షూటింగ్లు చేసుకోవచ్చు అంటూ తెలంగాణలో అనుమతి లభించినప్పటికీ.. ఈ మూవీలో పాల్గొనాల్సిన మిగిలిన వారు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
ఇది పక్కనపెడితే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కొద్ది శాతం మాత్రమే మిగిలి ఉంది. ఆ చిత్రీకరణను పూర్తి చేసుకొని దసరాకు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట. కానీ లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది దసరా సెలవులు ఎక్కువగా ఉండకపోవచ్చు. అప్పుడు క్యాష్ చేసుకోవడం కూడా కష్టం. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ‘పింక్’ రీమేక్గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోంది. ‘ఎమ్సీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, నివేథా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
Read This Story Also: చిరు హిట్ మూవీ సీక్వెల్ తీసిన తరువాతే రిటైర్మెంట్ తీసుకుంటా..!