Karthikeya: తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్న కార్తికేయ దంపతులు..
ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన హీరో కార్తికేయ- లోహిత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన హీరో కార్తికేయ- లోహిత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు కొత్త దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తికేయ-లోహిత వెంట వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతుల తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు కార్తికేయ-లోహిత . హైదరాబాద్లోని ఓ కల్యాణమండపం వేదికగా తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పెళ్లికి హాజరై కార్తికేయ- లోహిత దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక సినిమాల విషయానికొస్తే…’ఆర్ఎక్స్ 100′ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90 ఎంఎల్’ సినిమాల్లో హీరోగా నటించాడు. నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో విలన్గా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత ‘చావు కబురు చల్లగా’ అంటూ అలరించిన ఈ హీరో ఇటీవల ‘రాజా విక్రమార్క’తో మన ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వాలిమై’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read:
Ramya Krishna: తమిళ బిగ్బాస్ హోస్ట్గా శివగామి!.. కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..
Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..
Pragya Jaiswal: బాలకృష్ణ గారు చాలా సీనియర్.. ఆయన నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్..