తిరుపతిలోని ప్రసాదం లడ్డు వివాదం ఓ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రసాదం పరిశుభ్రతపై స్థానిక ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు దృష్టి పెడుతున్నారు. ఈ విషయంపై మరికొందరు తమ అభిప్రాయం మేరకు ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆలయ ప్రసాదం గురించి పిచ్చి కామెంట్స్ చేసిన తమిళ దర్శకుడిని తిరుచ్చి పోలీసులు అరెస్టు చేశారు.
‘బకాసురన్’, ‘ద్రౌపది’తో పాటు మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు మోహన్ జీ . తాజాగా మోహన్ జీ క్షత్రియను తిరుచ్చి పోలీసులు అరెస్టు చేశారు. పళని దేవాలయంలోని ప్రసాదం గురించి మోహన్ చేసిన కామెంట్స్ కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో మోహన్ జీ మాట్లాడుతూ.. ‘పళని ఆలయంలో ఇచ్చే పంచామృత ప్రసాదంలో పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక మాత్రలు కలపండి అని అన్నాడు” దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదవడంతో మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు.
వాంగ్మూలం ఆధారంగా తిరుచ్చి పోలీసులు మోహన్ను చెన్నైలో అరెస్టు చేసి తిరుచ్చికి తీసుకెళ్లినట్లుతెలుస్తోంది. మోహన్ జీ, తన సినిమాలతోనూ గతంలో వివాదంలో చిక్కుకున్నాడు. అతని చిత్రం ‘ద్రౌపది’ కుల వ్యవస్థను సమర్ధించిందని, పరువు హత్యను సమర్ధించిందని పలువురు ఆరోపించారు. ఇప్పుడు దర్శకుడు మోహన్ అరెస్ట్ తర్వాత పళని ఆలయంలోని ప్రసాదాన్ని కూడా పరీక్షించాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.