ఇద్దరు త‌మిళ‌ నటులపై కేసు న‌మోదు, రీజ‌న్ ఏంటంటే

తమిళనాడులో క‌రోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్కాగా నియ‌మ‌, నిబంధ‌న‌లు అమ‌లు చేస్తోంది.

ఇద్దరు త‌మిళ‌ నటులపై కేసు న‌మోదు, రీజ‌న్ ఏంటంటే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2020 | 4:55 PM

తమిళనాడులో క‌రోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్కాగా నియ‌మ‌, నిబంధ‌న‌లు అమ‌లు చేస్తోంది. ఎవ‌రైనా రూల్స్ అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. తాజాగా తమిళ నటులు విమల్​, సూరీలు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నేప‌థ్యంలో వారిపై కేసు నమోదు చేశారు కొడైక్కెనాల్​కు పోలీసులు. ప‌ర్మిష‌న్ లేని ఓ అటవీ ప్రాంతంలో వీరిద్దరూ సంచరించారని.. ఈ-పాస్​ లేకుండా ట్రావెల్ చేశార‌ని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారని వెల్లడించారు.

కొంప‌ముంచిన ఫోటోలు…

సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫోటోలే ఈ ఇద్ద‌రు న‌టుల‌ను ప్రాబ్లంలోకి నెట్టాయి. ప్రేమ్​రాజ్​ సరస్సు వద్ద వీరు తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్​ అవడం వల్ల.. విచారణకు ఆదేశించారు పోలీసులు. అటవీశాఖ అధికారుల ప‌ర్మిష‌న్ లేకుండా జులై 18న వీరిద్దరూ.. ఆ ఏరియాని సందర్శించినట్లు విచారణలో తెలిసింది. ఫలితంగా కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ఇద్దరికీ చెరో రూ.2000 జరిమానా విధించారు. ఇద్దరిపై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్ల‌డించారు. వాళ్లను సరస్సు వద్దకు తీసుకెళ్లిన ముగ్గురు స్టాఫ్ ను తొలిగించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటక ప్ర‌దేశానికి దాదాపు మూడు నెలలుగా ఎవరినీ అనుమతించట్లేదు.