సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకను విచారించిన ఈడీ

బాలీవుడ్​ న‌టుడు సుశాంత్​ సింగ్​ అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణం కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్​ విషయమై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దర్యాప్తు వేగ‌వతం చేసింది.

సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకను విచారించిన ఈడీ
Follow us

|

Updated on: Aug 21, 2020 | 8:06 PM

బాలీవుడ్​ న‌టుడు సుశాంత్​ సింగ్​ అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణం కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్​ విషయమై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దర్యాప్తు వేగ‌వతం చేసింది. తాజాగా సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్​ స్టేట్మెంట్ శుక్రవారం రికార్డు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. సుశాంత్​ బ్యాంకు అకౌంట్ నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు వివ‌రించారు.

ఇటీవలే సుశాంత్​ ఫాద‌ర్ కేకే సింగ్​, అతడి మరో సోదరి మితు సింగ్​లనూ ఈడీ అధికారులు విచారించారు. వీరితో పాటే సుశాంత్​ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్, నటుడి అకౌంటెంట్​ సందీప్​ శ్రీధర్​, మాజీ మేనేజర్​ శ్రుతి మోదీ తదితరులను ఈడీ విచారించింది. సుశాంత్​ తండ్రి కేకే సింగ్​ బిహార్​ పోలీసు స్టేషన్​లో చేసిన ఫిర్యాదు మేరకు.. జులై 31న రియా, ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు ఇతరులపై ఈడీ మనీల్యాండరింగ్​ కేసు నమోదు చేసింది.

Sushant Singh Rajput case: ED records the statement of late ...

Also Read :

బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది