సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకను విచారించిన ఈడీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానస్పద మరణం కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్ విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు వేగవతం చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానస్పద మరణం కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్ విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు వేగవతం చేసింది. తాజాగా సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ స్టేట్మెంట్ శుక్రవారం రికార్డు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సుశాంత్ బ్యాంకు అకౌంట్ నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు వివరించారు.
ఇటీవలే సుశాంత్ ఫాదర్ కేకే సింగ్, అతడి మరో సోదరి మితు సింగ్లనూ ఈడీ అధికారులు విచారించారు. వీరితో పాటే సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీ మెంబర్స్, నటుడి అకౌంటెంట్ సందీప్ శ్రీధర్, మాజీ మేనేజర్ శ్రుతి మోదీ తదితరులను ఈడీ విచారించింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు.. జులై 31న రియా, ఆమె ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇతరులపై ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.
Also Read :