తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజే వేరు. తెలుగులోనూ సూర్య మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. తెలుగులో సూర్య సినిమాలు మంచి విజయాలను అనుకుంటున్నాయి. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. గజినీ సినిమా నుంచి సూర్యకు క్రేజ్ పెరిగిపోయింది. ఇక సూర్య హీరోగానే కాదు నిర్మతగాను రాణిస్తున్నాడు. ఇక సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాను సినిమాలా చూడాలి అని సూర్య అన్నాడు. అసలు సూర్య ఎందుకు అలా అన్నాడో చూద్దాం.!
మెయ్యజగన్ అనే సినిమాఈవెంట్లో సూర్య పాల్గొన్నారు. సూర్య తమ్ముడు కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మెయ్యజగన్. సి.ప్రేమ్కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 సినిమాకు దర్శకత్వం వహించారు సి.ప్రేమ్కుమార్. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జోతికలు దీనిని నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. ఎలాంటి ఫైట్స్, యాక్షన్ సీన్స్ లేకుండా ఈ సినిమా ఉండబోతుంది.
ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. సినీ లవర్స్ ఎవరైనా సరే.. సినిమాని సినిమాలా చూడండి. కథ, కథనం, మ్యూజిక్, ఎమోషన్స్, కామెడీ.. ఇలా ప్రతీదాన్ని ఎంజాయ్ చేయండి. సినిమా కలెక్షన్స్ గురించి ఏమాత్రం ఆలోచించవద్దు. ఒక అభిమానిగా సినిమాని చూసి ఆనందించండి. సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.. సినిమాలో ఉన్న తప్పొప్పుల గురించి రివ్యూ చేయడం, కామెంట్స్ చేయడం పై దృష్టి పెట్టకండి అని సూర్య అన్నాడు. అలాగే ఈ సినిమా గురించి గతంలో కార్తీ మాట్లాడుతూ.. అన్నయ్య సూర్య ఇప్పటికే ఈ సినిమా చూశారని.. సినిమా అయిపోయిన తర్వాత సూర్య తనను గట్టిగా హత్తుకొని.. బాగా నటించవు అని అన్నారని కార్తీ తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.