Mahesh Babu: ఫ్యాన్ మూమెంట్.. సుహాస్ సినిమా పై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్..
ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు.
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుహాస్ నటన, సినిమా కథ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది ఈ సినిమా.
ఇక ఈ సినిమా పై ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రైటర్ పద్మభూషణ్ సినిమాను ప్రశంసించారు. రీసెంట్ గా మహేష్ బాబును కలిసి తమ సినిమా చూపించారు చిత్రయూనిట్.
సినిమా చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సినిమా చాలా బాగుంది. అందరు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా నచ్చింది. సుహాస్ నటన మనసుకు హత్తుకుంది అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. మహేష్ విషెస్ చెప్పడంతో చిత్ర యూనిట్ ఆనందంలో తేలిపోతుంది. ఇక సుహాస్ మహేష్ బాబు అభిమాని అని తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ సినిమా కోసం చొకాలు చించుకున్నాం అని అన్నారు సుహాస్.