Maha Samudram: ఓటీటీలో ఎగసిపడనున్న మహాసముద్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కుర్రహీరో శర్వానంద్ బొమ్మరిల్లు సిద్దార్ధ్ కలిసి నటించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
Maha Samudram: కుర్రహీరో శర్వానంద్ బొమ్మరిల్లు సిద్దార్ధ్ కలిసి నటించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అజయ్ తెరకెక్కించిన ఆర్.ఎక్స్100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ.. దాన్ని అందంగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడని ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. సినిమా విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ చేశారుచిత్రయూనిట్. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. మహా సముద్రం గత నెల 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మహా సముద్రం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మేరకు అధికార ప్రకటన చేశారు నెట్ ఫ్లిక్స్ టీమ్. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారనే టాక్ ఉంది. మహాసముద్రం సినిమా ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ శర్వా నటన అలాగే సిద్దు నటన బాగున్నాయన్న టాక్ ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :